చంద్రుణ్ణి చుట్టి వచ్చాం
పాతాళం లోతులు చూశాం
కానీ మానవత్వం నేర్చుకోలేకపోయాం...
భారత భాగవతాలు చదవలేం
దేవుణ్ణి ఎలాగూ పూజించలేం
మంచితనం ఎప్పుడూ భరించలేం
కనీసం మనిషిగా బ్రతుకుటకు ప్రయత్నించం...
ఎటూ పాలుపోని ఈ విషమ పరిస్థితిలో
అంతరాత్మను చంపుకోలేని అగమ్యగోచర స్థితిలో
సుదిగుందాల మధ్య చిక్కుకుని వేదనలో
బ్రతుకు గడుపుతున్నా స్మశాన వైరాగ్యంలో !!
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి